‘నా భర్తని నేనే చంపేశాను’ : రాగల 24 గంటల్లో – ట్రైలర్

కె.రాఘవేంద్ర రావు చేతుల మీదుగా విడుదలైన ‘రాగల 24 గంటల్లో’ థియేట్రికల్ ట్రైలర్..

  • Published By: sekhar ,Published On : November 6, 2019 / 05:54 AM IST
‘నా భర్తని నేనే చంపేశాను’ : రాగల 24 గంటల్లో – ట్రైలర్

కె.రాఘవేంద్ర రావు చేతుల మీదుగా విడుదలైన ‘రాగల 24 గంటల్లో’ థియేట్రికల్ ట్రైలర్..

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్), ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా.. ‘రాగల 24 గంటల్లో’.. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు చేతుల మీదుగా విడుదలైంది.

యాడ్ ఫిలిం మేకర్ రాహుల్ అనుకోకుండా మర్డర్ కావడం, ఆ కేసుని ఓ స్పెషల్ ఆఫీసర్ డీల్ చేయడం.. రాహుల్ భార్య తన భర్తని తానే చంపానని చెప్పడం.. ఇలా ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసేలా ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్ కట్ చేశారు.. ‘ఊహించని సంఘటనలతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా రూపొందించాం.. రాగల 24 గంటల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని తెలిసినప్పుడు ఎవరెలా స్పందించారు, అసలు ఆ 24 గంటల్లో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని మేకర్స్ చెప్తున్నారు.

Read Also : గొర్రెల్లా ఇంజనీరింగ్ చేయడం నావల్ల కాదు : ‘చూసీ చూడంగానే’ – టీజర్

ఇప్పటివరకు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి థ్రిల్లర్ సినిమా చేస్తుండడం విశేషం. ‘రాగల 24 గంటల్లో’ నవంబర్ 15న విడుదల కానుంది. మాటలు : కృష్ణభగవాన్, సంగీతం : రఘుకుంచె, లిరిక్స్ : భాస్కరభట్ల, శ్రీమణి, కెమెరా : అంజి, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : చిన్నా.