Radhe Shyam: టైటానిక్‌ను మించి.. విజువల్ వండర్‌గా రాధేశ్యామ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించని డార్లింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Radhe Shyam: టైటానిక్‌ను మించి.. విజువల్ వండర్‌గా రాధేశ్యామ్?

Radhe Shyam

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించని డార్లింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మార్చి 18న అభిమానుల ఆశ తీరబోతుంది. గతంలో ఒక ట్రైలర్ రిలీజ్ చేయగా మార్చి 2న మరో ట్రైలర్ కూడా వదిలి అభిమానులను హ్యాపీ చేశారు.

Radhe Shyam Release Trailer: ప్రేమకి విధికి మధ్య జరిగిన యుద్ధమే రాధేశ్యామ్!

గురువారం విడుదల చేసిన రిలీజ్ యాక్షన్ ట్రైలర్ విజువల్ వండర్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే షిప్ ఎపిసోడ్ ట్రైలర్ లో ప్రత్యేకంగా కనిపించగా సినిమాలో ఇదే హైలెట్ కాబోతుందని చెప్పుకుంటున్నారు. రాధే శ్యామ్ యాక్షన్ సినిమా ఏ మాత్రం కాదని మేకర్స్ ముందు నుండీ ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. రాధేశ్యామ్ కంప్లీట్ డిస్టినీని నమ్మే కథతో కూడిన లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీలో షిప్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది టైటానిక్ మాత్రమే. రాధేశ్యామ్ లో షిప్ సీన్ కూడా ఇప్పుడు టైటానిక్ రేంజ్ లోనే ఉండనుందని టాక్ మొదలైంది.

Radhe Shyam: ట్రైలర్‌తో కౌంట్‌డౌన్ స్టార్.. వారం రోజుల పాటు ప్రమోషన్ ఈవెంట్స్!

దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆస్కార్ విన్నర్ రేసుల్ పూకుట్టి రాధే శ్యామ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా క్లైమాక్స్ టైటానిక్ సినిమాను మించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని.. అంతకి మించి బాధను కలిగిస్తుందని కామెంట్ చేశారు. దీంతో రాధేశ్యామ్ సినిమా క్లైమాక్స్ గురించి ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ చెప్పడంతో ఇండస్ట్రీలో ఇదే పెద్ద టాపిక్ గా మారిపోయింది.