Prabhas Radheshyam : రాధేశ్యామ్ సీక్వెల్ రానుందా?
ఈ మధ్య సినిమాల్లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. ఓ సినిమా హిట్ అయితే దానికి తగినట్లు మరో కథ రాసి సినిమా తీసేస్తున్నారు.
Prabhas Radheshyam : ఈ మధ్య సినిమాల్లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. ఓ సినిమా హిట్ అయితే దానికి తగినట్లు మరో కథ రాసి సినిమా తీసేస్తున్నారు. గతంలో సీక్వెల్ సినిమాలు భారీ హిట్లు కొట్టడంతో స్టార్ హీరోలు, డైరక్టర్లు వీటిపై దృష్టిపెట్టారు. ఇక ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఒక సీక్వెల్ మూవీ రూపుదిద్దుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ మూవీకి సంబంధించి కొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
చదవండి : Radhe Shyam : రెండు డిఫరెంట్ కట్స్లో ‘రాధే శ్యామ్’..
ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్ కానుంది. అయితే రాధేశ్యామ్ మేకర్స్ సీక్వెల్కు సన్నాహాలు చేస్తున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
చదవండి : Radhe Shyam: అభిమానులకు మరో ట్రీట్.. దీపావళికి ముహూర్తం
ఇక రాధేశ్యామ్ బాక్సాపీస్ వద్ద ఎలాంటి అంచనాలకు చేరుకుంటుందో చూసిన తర్వాత సీక్వెల్పై క్లారిటీకి రానున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్ వస్తుందో లేదో తెలియాలి అంటే విడుదల వరకు ఆగాల్సిందే..