Jathi Ratnalu : జోగి పేట రవిని రా నేను, తిరిగి రండి..అంటూ నవీన్, దర్శిలకు స్వీట్ వార్నింగ్
Rahul Rama Krishna : టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ ఎలాంటి రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ ఫిల్మ్ బ్రహ్మాండమైన విజయం సాధించింది. చిత్ర యూనిట్ తో పాటు..నటీ నటులు ఫుల్ జోష్ లో ఉన్నారు. భారీగా లాభాలు రావడంతో సక్సెస్ టూర్ ను చేపడుతున్నారు. సక్సెస్ టూర్ లో భాగంగా..నవీన్, ప్రియదర్శిలు అమెరికాకు వెళ్లారు.
అక్కడ పలు ప్రాంతాల్లో తిరుగుతూ..ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను వారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఈ వీడియోలు ‘రాహుల్ రామకృష్ణ’ దృష్టికి వచ్చింది. తనదైన స్టైల్లో స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నాకు చెప్పకుండా..పోతారా..ఇక్కడకు రండి..వచ్చిన తర్వాత చెబుతాను..అంటూ స్వీట్, ఫన్నీ వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అసలు వీడియోలో ఏం మాట్లాడారు : –
‘అరేయ్ దర్శి, నవీన్.. పీపుల్స్ ప్లాజాలో సక్సెస్మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసే లోపే పాస్పోర్ట్తో ఎయిర్పోర్ట్కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్ వెళ్లిపోతారేరా. నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్ కార్డ్ ఉందని, పాన్కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా..మీరు రండ్రా మీ సంగతి చెబుతా..’అంటూ ఫన్నీగా చెప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్.
Scandalous video response to #JathiRatnalu team’s USA success tour by @eyrahul @NaveenPolishety @priyadarshi_i https://t.co/vZpJocELTI pic.twitter.com/67Upo8Gl1m
— Rahul Ramakrishna (@eyrahul) March 20, 2021