ప్రారంభమైన ‘ఇద్దరి లోకం ఒకటే’

ఇద్దరి లోకం ఒకటే.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : April 22, 2019 / 10:35 AM IST
ప్రారంభమైన ‘ఇద్దరి లోకం ఒకటే’

ఇద్దరి లోకం ఒకటే.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కూమారి 21ఎఫ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ హీరోగా, దిల్ రాజు బ్యానర్‌లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. జి.ఆర్.కృష్ణ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం: 35గా రూపొందబోయే ఈ సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ క్లాప్ నివ్వగా, ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేసారు. దిల్ రాజ్ మనవడు ఆరాన్ష్ గౌరవ దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ, యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందబోయే ఈ మూవీకి ‘ ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్ పెట్టారు. ‘యూ ఆర్ మై హార్ట్ బీట్’ అనేది ట్యాగ్ లైన్.

గతకొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్, ఈ సినిమా తనకి బ్రేక్ ఇస్తుందనే హోప్‌తో ఉన్నాడు. హీరోయిన్‌తో సహా మిగతా నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకి కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : తమ్మిరాజు, మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్, మాటలు : అబ్బూరి రవి.