Rajamouli : ఏపీ సీఎం జగన్కి ధన్యవాదాలు తెలుపుతూ రాజమౌళి ట్వీట్..
రాజమౌళి.. ''కొత్త G.Oలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపి సిఎం జగన్ గారు మరియు మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల..........
Rajamouli : గత కొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్ల అంశంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం వీటికి ముగింపు పలుకుతూ సినిమా టికెట్ రేట్లను ఓ మోస్తరుగా పెంచుతూ కొత్త జీవోని విడుదల చేసింది. ఇందుకు ఏపీ ప్రభుత్వానికి, ఏపీ సీఎం జగన్కి, పేర్ని నానికి ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి, ప్రభాస్.. లాంటి స్టార్లు ట్వీట్లు చేయగా మరికొంతమంది ప్రముఖులు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు.
రాజమౌళి.. ”కొత్త G.Oలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపి సిఎం జగన్ గారు మరియు మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
Vishwak Sen : ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్
అలాగే తెలంగాణ సీఎం కెసిఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు. ఇందులో..”తెలంగాణాలో పెద్ద సినిమాలకు 5వ ఆట కు పర్మిషన్ ఇచ్చినందుకు తెలంగాణ సిఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు. అలాగే మాకు నిరంతర మద్దతు ఇస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుగుదలకు ఇది మంచి పరిణామం” అంటూ పోస్ట్ చేశారు.
Thanks to the CM of AP @ysjagan garu and @perni_nani garu for aiding the Telugu Film fraternity through the revised ticket pricing in the new G.O. Hope this helps towards the revival of cinemas.
— rajamouli ss (@ssrajamouli) March 9, 2022
A big thanks to the CM KCR garu and the Telangana govt for permitting 5 shows a day for big films. Also, thanks to @YadavTalasani garu for your continuous support to us. This is a big help to the film fraternity. @TelanganaCMO
— rajamouli ss (@ssrajamouli) March 9, 2022