అందుకే ప్లాస్మా డొనేట్ చేయలేదు..

  • Published By: sekhar ,Published On : September 1, 2020 / 03:45 PM IST
అందుకే ప్లాస్మా డొనేట్ చేయలేదు..

Rajamouli told Reason behind not to Donate Plasma: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన స‌మ‌యంలోనే తాము క‌రోనా వైర‌స్‌ను జ‌యిస్తామ‌ని, ప్లాస్మాను దానం చేసి క‌రోనా వారియ‌ర్స్‌గా నిలుస్తామ‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. చెప్పిన‌ట్లుగానే రాజ‌మౌళి, కీర‌వాణి అండ్ ఫ్యామిలీ క‌రోనా వైర‌స్ నుండి బ‌య‌ట‌ప‌డ్డారు.



ఇప్పుడు కీర‌వాణి, ఆయ‌న త‌న‌యుడు కాల‌భైర‌వ కిమ్స్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మా డొనేట్ చేశారు. కానీ రాజ‌మౌళి ప్లాస్మాను డొనేట్ చేయ‌లేదు. అయితే తాను ప్లాస్మాను డొనేట్ చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని ట్విట్ట‌ర్‌ ద్వారా తెలియచేశారు రాజ‌మౌళి. ‘‘యాంటీ బాడీస్ కోసం టెస్ట్ చేశారు. నా ఐజీజీ లెవల్స్ 8.62గా ఉన్నాయి. కానీ ఆ లెవల్స్ 15గా ఉండాలి. ఈరోజు పెద్దన్నయ్య, భైరవ ప్లాస్మాను డొనేట్ చేశారు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి.
https://10tv.in/bathukamma-sarees-for-dussehra-festival/