ఆర్జీవీకి కేఏ పాల్ ఫోన్: నన్ను వదిలేయండి అంటున్న రాజమౌళి
రామ్ గోపాల్ వర్మ అంటే గుర్తొచ్చేది పబ్లిసిటీ, తర్వాత గుర్తొచ్చేది ఎవరో ఒకరిని గెలికి తన ప్రచారానికి వాడేసుకుంటాడు అనే విషయం. అవును ఎప్పుడూ కాంట్రవర్శీలకు కేరాఫ్గా నిలిచే వర్మ ఇప్పుడు కేఏ పాల్ను గెలికేశాడు. గెలకడం కూడా అలా ఇలా కాదు గట్టిగా గెలికేశాడు. కేఏ పాల్ మీద ఏకంగా ఓ పాటను వదిలేశాడు.
అంతటితో ఆపేసి ఉంటే వర్మ ఎందుకు అవుతాడు. కిందపడినా, పైకిలేచినా ఎవడెన్ని తిట్టుకున్నా సరే తన పంథాను విడవడు కదా? దర్శక ధీరుడు రాజమౌళిని కూడా తన ప్రచారానికి వాడేసుకున్నాడు. కేఏ పాల్కి సంబంధించిన పాటను కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా నుంచి విడుదల చేసిన వర్మ రాజమౌళి జోకర్ సినిమాను తెలుగులో కేఏ పాల్ను హీరోగా పెట్టి తీస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
బాహుబలి సినిమా కంటే పెద్ద హిట్ ఈ సినిమా అవుతుందని దీనికి సంబంధించిన మాటలు రాజమౌళికి, కేఏ పాల్కి మధ్య నడుస్తున్నట్లు కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని కేఏ పాల్ తనకు ఫోన్ చేసి చెప్పినట్లుగా వర్మ చెప్పారు. అయితే ఈ ట్వీట్కి రాజమౌళి కూడా సమాధానంగా ట్వీట్ చేశారు. రాజు గారు నన్ను వదిలేయండి అంటూ రాజమౌళి వర్మకు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nannu involve cheyyakandi “RAJU” garu.. ??♂️
— rajamouli ss (@ssrajamouli) November 2, 2019
If JOKER is such a big hit in India a biopic on K A PAUL will be bigger than BAHUBALI 3 ..I heard @ssrajamouli is already in talks with K A PAUL in Washington D C..This K A PAUL only phoned me and told me https://t.co/Y7gqsYgd33
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2019