Rajshekar-Mohan Babu : రాజశేఖర్, మోహన్ బాబు మల్టీస్టారర్ సినిమా అలా మిస్ అయింది..

రాజ‌శేఖ‌ర్‌, మోహ‌న్ బాబుతో ఈ సినిమా చేయాల‌ని డైరెక్టర్ అనుకున్నారట. ఇద్దరూ ఓకే కూడా చెప్పారు కానీ రాజశేఖర్ తర్వాత వద్దని చెప్పడంతో ఈ మల్టీస్టారర్..........

Rajshekar-Mohan Babu : రాజశేఖర్, మోహన్ బాబు మల్టీస్టారర్ సినిమా అలా మిస్ అయింది..

Rajshekar Mohan Babu

Rajshekar-Mohan Babu :   రాజశేఖర్, మోహన్ బాబు గతంలో స్టార్ హీరోలుగా చెలామణి అయ్యారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ వస్తున్నారు. రాజశేఖర్ మాత్రం అప్పుడప్పుడు విజయాలతో హీరోగానే మెల్లిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు రాజశేఖర్. ఈ ఇంటర్వ్యూలలో చాలా ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇందులో భాగంగానే మోహన్ బాబుతో మల్టీస్టారర్ మిస్ అయిందని తెలిపాడు.

జ‌గ‌ప‌తి బాబు, అర్జున్‌, వేణు హీరోలుగా 20 ఏళ్ళ క్రితం వ‌చ్చిన సినిమా ‘హ‌నుమాన్ జంక్ష‌న్‌’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో మంచి విజయం సాధించింది. ఇప్పటికి ఆ సినిమాని చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఈ సినిమా కామెడీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, అర్జున్‌ ప్లేస్ లో ముందు వాళ్ళని అనుకోలేదట. రాజ‌శేఖ‌ర్‌, మోహ‌న్ బాబుతో ఈ సినిమా చేయాల‌ని డైరెక్టర్ అనుకున్నారట. ఇద్దరూ ఓకే కూడా చెప్పారు కానీ రాజశేఖర్ తర్వాత వద్దని చెప్పడంతో ఈ మల్టీస్టారర్ మిస్ అయింది.

Mahesh Babu : మెగాస్టార్ రాకతో మళ్ళీ వాయిదా పడనున్న ‘సర్కారు వారి పాట’

ఈ విష‌యంపై తాజాగా రాజ‌శేఖ‌ర్‌ ఆ సినిమాను ఎందుకు వ‌దులుకోవాల్సి వ‌చ్చిందో తెలిపారు. ‘హ‌నుమాన్ జంక్ష‌న్’ సినిమా ఒప్పుకున్న‌ప్పుడు అందులో మోహ‌న్ బాబు కూడా ఉన్నాడ‌ని రాజ‌శేఖ‌ర్‌కు తెలియ‌దంట‌. మోహ‌న్ బాబు కూడా ఉన్నాడ‌ని తెలిసిన తర్వాత సినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌ట‌. అప్ప‌టికే తీసుకున్న అడ్వాన్స్ కూడా వెన‌క్కి ఇచ్చేశాడంట‌. ఎందుకు అని అడగగా.. ”షూటింగ్ 9 గంట‌ల‌కు ఉందంటే నేను ప‌ది గంట‌లకు వెళ్తాను. కానీ మోహ‌న్ బాబు అలా కాదు. క‌చ్చితంగా టైమ్ పాటిస్తాడు. నాకు ఆ క్ర‌మ‌శిక్ష‌ణ లేదు. ఈ విష‌యంలో సినిమా పూర్త‌య్యేస‌రికి కచ్చితంగా గొడ‌వ‌లు వ‌స్తాయి. దీంతో మా రిలేష‌న్ దెబ్బ‌తింటుందనే ఉద్దేశంతోనే సినిమా నుంచి తప్పుకున్నాను” అని తెలిపారు.

SSMB 28 : మహేష్ 28వ సినిమా పనులు మొదలుపెట్టేసిన త్రివిక్రమ్, తమన్

రాజశేఖర్ తప్పుకోవడంతో మోహన్ బాబుని కూడా వద్దు అనుకోని డైరెక్టర్ జగపతి బాబు, అర్జున్ లతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా డైరెక్టర్ మోహన రాజా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ ని చిరంజీవితో గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నాడు.