Rajinikanth : ‘అన్నాత్తే’ స్టోరీ విని ఏడ్చేశాను : రజినీకాంత్
నా కోసం 20 రోజుల్లో కథ సిద్దం చేశాడు. రెండు గంటలకుపైగా 'అన్నాత్తే' కథ వినిపించాడు. కథ విన్న తర్వాత నాకు కన్నీళ్లు వచ్చాయి. నాకు ఎలా కథ చెప్పాడో అలానే సినిమా చేయాలని
Rajinikanth : సూపర్స్టార్ రజనీకాంత్ నుంచి ఇటీవల వచ్చిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’గా రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఇలాంటి టైంలో థియేటర్స్ లో రిలీజ్ అయి 200 కోట్లను కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. డైరెక్టర్ శివ తొలిసారి రజనీకాంత్తో సినిమాని తెరకెక్కించాడు. ఇటీవల రజినీకాంత్ కూతురు సౌందర్య విడుదల చేసిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘హూట్’ యాప్ ద్వారా రజినీకాంత్ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా డైరెక్టర్ శివతో పనిచేసిన అనుభవాన్ని, ‘అన్నాత్తే’ సినిమా గురించి షేర్ చేసుకున్నారు రజనీకాంత్.
Puneeth Rajkumar : పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది .. శరత్ కుమార్ ఎమోషనల్
నేను నటించిన ‘పేట’, అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమాలు ఒకే టైంలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. నేను ‘విశ్వాసం’ నిర్మాతను సంప్రదించి నాకు సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేయమని అడిగాను. సినిమా ఫస్ట్ హాఫ్ తర్వాత ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యేంత ప్రత్యేకత ఏముంది అనుకున్నాను. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా మారిపోయింది. సినిమా పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టాను. ఆ తర్వాత నిర్మాత త్యాగరాజన్ని అభినందించి, ఆ సినిమా డైరెక్టర్ శివతో మాట్లాడాలని అడిగాను అని చెప్పారు రజినీకాంత్.
Puneeth Rajkumar : పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం
ఆ తర్వాత శివ నన్ను కలిశాడు. శివతో మొదటి సంభాషణ తర్వాత అతడిపై బాగా నమ్మకం పెరిగింది. శివ చాలా అమాయకంగా, నిజాయితీగా ఉంటాడు. నీ దగ్గర నా కోసం ఏదైనా కథ ఉందా? మనం విశ్వాసం సినిమాలా మంచి హిట్టు కొట్టాలని అడిగాను. దీనికి శివ మీతో హిట్ సినిమా తీయడం చాలా ఈజీ అన్నాడు. గతంలో ఏ దర్శకుడు నాతో ఇలాంటి కామెంట్ చేయలేదు. శివకున్న ఆత్మవిశ్వాసం నాకు బాగా నచ్చింది. నా కోసం 20 రోజుల్లో కథ సిద్దం చేశాడు. రెండు గంటలకుపైగా ‘అన్నాత్తే’ కథ వినిపించాడు. కథ విన్న తర్వాత నాకు కన్నీళ్లు వచ్చాయి. నాకు ఎలా కథ చెప్పాడో అలానే సినిమా చేయాలని చెప్పాను. చెప్పిన దాని కంటే బాగా చేస్తానని మాటిచ్చాడు. శివ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు అని రాజీకాంత్ తన అనుభవాలని షేర్ చేసుకున్నారు.