రజినీకాంత్ కుమార్తె సౌందర్యకి మళ్లీ పెళ్లి

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 06:12 AM IST
రజినీకాంత్ కుమార్తె సౌందర్యకి మళ్లీ పెళ్లి

కుమార్తె సౌందర్యకి మళ్లీ పెళ్లి చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. ఫిబ్రవరి 11వ తేదీన చెన్నైలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లి పిలుపులుగా కూడా ప్రారంభం అయ్యాయి. పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు కుటుంబ సభ్యులు. బావ, అక్క అయిన ధనుష్, ఐశ్వర్య కూడా ఇంటింటికీ వెళ్లి అందర్నీ ఆహ్వానిస్తున్నారు. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

వరుడు విశాగన్ :
సౌందర్యను వివాహం చేసుకునే వరుడు విశాగన్ వనంగమూడి. ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు కూడానూ. ఏడాది క్రితమే వీరికి నిశ్చితార్ధం జరిగింది. రెండు కుటుంబాల సమక్షంలో ఇంట్లోనే ఈ వేడుక ముగించారు. పెళ్లి మాత్రం 2019, ఫిబ్రవరి 11వ తేదీన చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్ లో గ్రాండ్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సౌందర్యకు రెండో పెళ్లి :
సౌందర్యకు ఇది రెండో వివాహం. గతంలో అశ్విన్ రామకుమార్ ను చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్యభర్తల మధ్య గొడవతో 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. రెండేళ్లుగా ఒంటరిగా ఉంటోంది సౌందర్య. మళ్లీ పెళ్లి చేయాలని రజినీకాంత్ నిర్ణయించుకోవటంతో సౌందర్య కూడా ఒప్పుకుంది. తనకు నచ్చిన విశాగన్ తోనే పెళ్లికి సిద్ధం అయ్యింది. రజినీకాంత్ ఇంట శుభకార్యంతో ఆయన అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారు.