Rajinikanth: కూతురు దర్శకత్వంలో రజనీ తదుపరి సినిమా?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కమర్షియల్ మాస్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రజనీతో చాలా సంవత్సరాల తర్వాత నయనతార జోడీ కట్టింది.
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కమర్షియల్ మాస్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రజనీతో చాలా సంవత్సరాల తర్వాత నయనతార జోడీ కట్టింది. కాగా.. ఈ సినిమా తర్వాత రజనీ ప్రస్తుతం కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు.
ఈ మధ్యనే ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీ గురువారం చెన్నైకి తిరిగి రానున్నారు. కాగా, ఇప్పుడు తదుపరి సినిమా.. రాజకీయ అరంగేట్రంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రజినీకాంత్ తదుపరి సినిమా కోసం ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు కథలు వినిపించారట. కానీ రజినీకాంత్ మాత్రం ఎవరికీ ఒకే చెప్పలేదు. ఆయన కూతురు సౌందర్య కూడా ఓ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు ప్రచారం జరుగుతుండగా తలైవా తన తర్వాతి సినిమాను కూతురు డైరెక్షన్లోనే చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అంతా అనుకుంటున్నారు.
అంతేకాదు చివరిగా కూతురు డైరెక్షన్లోనే సినిమా చేసి ఇక విశ్రాంతి తీసుకోవాలని రజినీ భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. త్వరలోనే కూతురుతో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సౌందర్య రజనీతో యానిమేటెడ్ మూవీ కొచ్చడియాన్ (విక్రమసింహ)ని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా తర్వాత రజనీ సినిమాలకు దూరమవుతారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.