శ్రీరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేస్తామంటున్నారు – పిఎస్లో రాకేష్ మాస్టర్ కంప్లయింట్..
నటి శ్రీరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాకేష్ మాస్టర్..
నటి శ్రీరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాకేష్ మాస్టర్..
శ్రీరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్బుక్లో తనను చంపుతానని బెదిరించిందని, ఆమె అనుచరులతో ఫోన్ చేయిస్తూ బెదిరిస్తోందని వీడియో రికార్డులను పోలీసులకు అందజేశారు.
తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని, అక్కడి పోలీసులను హైదరాబాద్కు పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి తనను అక్కడి పోలీసులతో కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని అన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ప్రతీరోజు తనకు వందల సంఖ్యలో కాల్ చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా, అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను అంతం చేస్తామని కూడా బెదిరించారని రాకేష్ మాస్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్ హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ శ్రీరెడ్డి చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.