గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ముద్దుగుమ్మలు..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది..
Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతూ, తమ ఆత్మీయులను కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఛాలెంజ్ను పూర్తి చేశారు. యువసామ్రాట్ నాగ చైతన్య ఛాలెంజ్ను స్వీకరించిన రకుల్ తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదు. మనందరం కలిసి చేయాల్సిన కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలి. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకువెళ్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అన్నారు. అలాగే ఈ ఛాలెంజ్కు తన అభిమానులందరినీ నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు.
మరో హీరోయిన్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ను పూర్తి చేశారు. తనంతట తానుగా ముందుకు వచ్చి ఈ ఛాలెంజ్ను స్వీకరించి, బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు నాటారామె.
https://10tv.in/legendary-cricketer-kapil-dev-and-actress-rajisha-vijayan-participated-green-india-challenge/
ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ.. ‘రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు పచ్చదనాన్ని కాపాడడం కోసం చాలా చక్కని ఛాలెంజ్ను చేపట్టారు. ఆ స్ఫూర్తితోనే నేను మొక్కలు నాటాను. ఈ ఛాలెంజ్కు అనూ ఇమ్మానుయేల్, నిధి అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్లను నామినేట్ చేస్తున్నాను’.. అన్నారు నభా నటేష్.