బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రకుల్ ఎంతకాలంగా డ్రగ్ తీసుకుంటున్నారు? డ్రగ్ పెడ్లర్లతో డైరెక్ట్‌గా పరిచయాలు ఉన్నాయా?

  • Published By: naveen ,Published On : September 24, 2020 / 04:25 PM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రకుల్ ఎంతకాలంగా డ్రగ్ తీసుకుంటున్నారు? డ్రగ్ పెడ్లర్లతో డైరెక్ట్‌గా పరిచయాలు ఉన్నాయా?

మొదటినుంచి రియా బ్లాస్టింగ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రధానంగా వినిపించింది. అప్పటినుంచే టాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా పాత్రపై చర్చ రచ్చ చేస్తోంది. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ట్రై చేస్తున్న రకుల్… కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే… హైదరాబాద్‌లో ఎఫ్ 45 పేరుతో ఫిట్‌నెస్ ఫ్రాంచైజీ కూడా రన్ చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్న రకుల్ పేరు ఇప్పుడు డ్రగ్స్ కేసులో బయటపడటం కలకలం రేపుతుంది.

దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ముంబైలోనూ తన రిలేషన్స్ కొనసాగిస్తోంది. అటు రియా చక్రవర్తితో కూడా క్లోజ్ రిలేషన్‌షిప్‌లో ఉంది. సుశాంత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తిని నిందితురాలిగా పేర్కొన్న సమయంలోనూ ఆమెకి అండగా రకుల్ ప్రీత్ సింగ్ చాలా సందర్భాల్లో ట్వీట్లు పెట్టింది. ఈ క్రమంలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా రియా చక్రవర్తి స్వయంగా ఒప్పుకున్నట్లు ఎన్‌సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) వెల్లడించింది. అయితే ఈ రాకెట్లో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఫోకస్ పెట్టింది నార్కోటిక్స్ వింగ్.

బాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసు రకుల్‌ప్రీత్‌ సింగ్ మెడకు చుట్టుకుంటుందా? ఇదే ఇప్పుడు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నార్కోటిక్స్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తి నోటి వెంట రకుల్‌ప్రీత్‌ పేరు రావడంతో… ఆమెకు నోటీసులు పంపించారు ఎన్సీబీ అధికారులు. రేపు(సెప్టెంబర్ 25,2020) విచారణకు రావాలని పిలిచారు. రకుల్ ప్రీత్ సింగ్ కనుక కేసులో చిక్కుకుపోతే.. ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలపై కూడా ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉంది.