Rakul : డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ప్రీత్ సింగ్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. గంటన్నర ముందే రకుల్ ఈడీ ఆఫీస్ కు వచ్చింది. ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
drugs case ED trial : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ప్రీత్ సింగ్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. గంటన్నర ముందే రకుల్ ఈడీ ఆఫీస్ కు వచ్చింది. ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 6వ తేదీన విచారణకు రాలేనన్న రకుల్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ ఇవాళే విచారణకు రమ్మని కోరింది. దీంతో రకుల్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు.
డ్రగ్స్ కేసులో రకుల్ తొలిసారిగా విచారణకు హాజరయ్యారు. 2017లో ఎక్సైజ్ అధికారుల విచారణలో రకుల్ పేరు కనిపించలేదు. ముంబై సుశాంత్ కేసులో గతంలో రకుల్కు ఎన్సీబీ నోటీసులు జారీ అయ్యాయి. డ్రగ్స్ లింక్లపై ముంబై ఎన్సీబీ ముందు రకుల్ హాజరయ్యారు. తాజాగా తెలంగాణ డ్రగ్స్ కేసులో రకుల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. హైదరాబాద్, ముంబై డ్రగ్ మాఫియాతో ఉన్న ఆధారాలు చూపి ఈడీ రకుల్ను ప్రశ్నించనుంది. బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.
అయితే ఇప్పటికే పూరీ, ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. రకుల్పై కూడా ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణలో రకుల్ పేరు లేకపోయినప్పటికీ.. డ్రగ్స్ విచారణ చేపట్టిన ఈడీ.. రకుల్ పేరును కూడా చేర్చింది. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రమేయంపై ఉన్నట్లు కూడా ఈడీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారంలో రకుల్ పేరు ఉందా? లేదా? అన్నది ఈడీ విచారణలో తేలనుంది. డ్రగ్స్ సరఫరా కోసం సినీ తారల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించిన అధికారులు.. విచారణకు హాజరైన వారందరి బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తోంది. రకుల్ బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ పరిశీలించనుంది. కెల్విన్తో రకుల్కు పరిచయం ఉందా? లేదా? అన్న దానిపైనా ఈడీ ఆరా తీయనుంది.