ప్రభాస్ ఫ్రెండ్ ఇంట విషాదం.. హాజరైన రామ్ చరణ్, శర్వానంద్..

  • Published By: sekhar ,Published On : September 1, 2020 / 06:00 PM IST
ప్రభాస్ ఫ్రెండ్ ఇంట విషాదం.. హాజరైన రామ్ చరణ్, శర్వానంద్..

Ram Charan and Sharwanand Producer Rajagopal Reddy Funeral: సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత్యక్రియలకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం ఈదగాలిలో ఈ అంత్యక్రియలు జరిగాయి.

ప్రభాస్ ఫ్రెండ్, యూవీ క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన వంశీ తండ్రి రాజగోపాల్ రెడ్డి. ఆయన కొంతకాలంగా వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటుతో మరణించగా అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన ఈదగాలిలో నిర్వహించారు.

ఈ అంత్యక్రియలకు రామ్ చరణ్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. చెర్రీ, శర్వా రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, ప్రభాస్ చాలాకాలంగా ఫ్రెండ్స్. డార్లింగ్‌తో ‘సాహో’ వంటి ప్యాన్ ఇండియా సినిమాను నిర్మించారు వంశీ, ప్రమోద్.

Ram Charan