Ram Charan : నాన్న గారి మెసెంజర్‌‍గా వచ్చాను

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''నేను ఇక్కడకి అతిథిగా రాలేదు. నాన్న గారి తరపున మెసెంజర్ గా వచ్చాను. ఈ సినిమా నిర్మాతలు శ్రావ్యా స్టైలిస్ట్ గా, సుధీర్ డిస్ట్రిబ్యూటర్ గా .......

Ram Charan : నాన్న గారి మెసెంజర్‌‍గా వచ్చాను

Ram Charan

Ram Charan :  కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా జనవరి 28న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలుగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా రావాల్సి ఉంది. కానీ చిరంజీవికి కరోనా సోకడంతో రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చారు.

Ram Charan : రామ్ చరణ్, బాలయ్య బాబు గణతంత్ర వేడుకలు

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ”నేను ఇక్కడకి అతిథిగా రాలేదు. నాన్న గారి తరపున మెసెంజర్ గా వచ్చాను. ఈ సినిమా నిర్మాతలు శ్రావ్యా స్టైలిస్ట్ గా, సుధీర్ డిస్ట్రిబ్యూటర్ గా చేస్తూ ఈరోజు నిర్మాతలుగా మారారు. ఈ సినిమాలో నేషనల్ అవార్డులు గెలిచిన వారు వున్నారు. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా, మీనింగ్ ఫుల్ సినిమా. డైరెక్టర్ నగేష్ గారు సినిమాలు చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఈ రోజు రాజమౌళి వల్ల తెలుగు సినిమా ఇండియన్ సినిమా గా ఎదిగింది. మహిళలు మగవాళ్ళు తేడా లేకుండా వర్క్ విషయంలో ఎంతో ఇష్టంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ సినిమాగా తెలుగు సినిమా మారింది. కీర్తి సురేష్ వర్క్ ని నేను అజ్ఞాత వాసి అపుడే చూసాను. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి అందరూ 28న ‘గుడ్ లక్ సఖి’ సినిమా చూడండి ..