మృగాళ్ల వెన్నులో వణుకు పుట్టాలి – వర్మ కొత్త సినిమా ‘దిశ’

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం ‘దిశ’..

  • Published By: sekhar ,Published On : February 1, 2020 / 09:39 AM IST
మృగాళ్ల వెన్నులో వణుకు పుట్టాలి – వర్మ కొత్త సినిమా ‘దిశ’

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం ‘దిశ’..

ఇటీవల ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో సెన్సనేషన్ క్రియేట్ చేసిన కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ శనివారం తన కొత్త సినిమా ప్రకటించాడు. సమాజంలోయదార్థ సంఘటనలనే అంశాలనే కథగా తీసుకొని సినిమాలను తెరకెక్కించడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు వర్మ తీసిన వివాదస్పద చిత్రాలే ఇందుకు నిదర్శనం. ‘రక్త చరిత్ర’ 2 భాగాలు, ‘26/11’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి వాస్తవిక ఘటనల ఆధారాంగా వర్మ తీసిన సినిమాలు ఆకట్టుకున్నాయి.

తాజాగా యావత్‌ దేశాన్ని కుదిపేసిన దిశ ఘటన ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు వర్మ అధికారికంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. తన తదుపరి సినిమాకి సంబంధించిన వివరాలు తెలియచేస్తూ.. దిశ అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్‌ చేశాడు.

‘దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా చేయబోతున్నాను. ఆ సినిమాకు ‘దిశ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశాం. ఢిల్లీలో నిర్భయ ఘటన వంటి అత్యంత పాశవిక ఘటన జరిగిన తర్వాత ఓ యువతిపై అత్యాచారం చేసి సజీవదహనం చేశారు. నిర్భయ దోషుల నుంచి కొత్తగా వస్తున్న అత్యాచార దోషులు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ చిత్రంలో  భయంకరమైన గుణపాఠంగా తెలపబోతున్నాం.. 

ఢిల్లీలో నిర్భయను అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలివెళ్లారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని దిశను ఆ దోషులు కాల్చి చంపారు. నిర్భయ దోషులను ఈ రోజు ఉరి వేయాల్సింది. కానీ మురికి న్యాయవాది ఏపీ సింగ్‌ పిటిషన్‌ వేసి ఉరిశిక్ష వాయిదా పడేలా చేశారు.. ‘దిశ’ లో నిందితులకు వేసే శిక్ష నా స్టైల్‌లో ఉంటుంది’ అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు. త్వరలో ‘దిశ’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.