చిరంజీవి నాకు పునర్జన్మనిచ్చారు.. సీనియర్ జర్నలిస్ట్ రామ్ మోహన్ నాయుడు..

చిరంజీవి నాకు పునర్జన్మనిచ్చారు.. సీనియర్ జర్నలిస్ట్ రామ్ మోహన్ నాయుడు..

Ram Mohan Naidu: తీవ్ర అనారోగ్యంతో గత 4 నెలల నుండి చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్ మోహన్ నాయుడుని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పి, స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకోవడమే కాకుండా ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేశారు చిరంజీవి.ఆయన ఆరోగ్యం కుదుటపడి కోలుకోవడంతో శనివారం మెగాస్టార్ చిరంజీవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు రామ్ మోహన్ నాయుడు..

ఈ సందర్భంగా రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘నేను ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నాను. గత నాలుగు నెలల నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు. కరీంనగర్‌లో చికిత్స తీసుకున్నాను. మొదట జాండిస్ అన్నారు.. కానీ ఆ ట్రీట్‌మెంట్‌లో చాలా వీక్ అయ్యాను, మనుషులను కూడా గుర్తు పట్టలేకపోయాను. ఇడ్లీలో సగంకుడా తినలేని పరిస్థితి.. అక్కడనుండి హైదరాబాద్ వచ్చాను, నా అనారోగ్యం గురించి చిరంజీవి గారు తెలుసుకుని నన్ను ఇంటి నుంచి ఆసుపత్రిలో చేర్పించారు.

నిజంగా ఇది నాకు పునర్జన్మ లాంటిది. చిరంజీవి గారు నా అనారోగ్యం గురించి తెలుసుకుని, ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అక్కడి వైద్యలు, చిరంజీవి గారి వల్లనేను పూర్తిగా కొలుకున్నాను. చిరంజీవి గారు లేకుంటే నా పరిస్థితి ఏమై పోయేదో. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌కు నా జన్మంతా రుణపడి ఉంటాను, అలాగే స్వామి నాయుడు, మెగా ఫ్యాన్స్‌కు కూడా నా ధన్యవాదాలు’’.. అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గారు కూడా ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు..

Chiranjeevi