కశ్మీర్‌లో అలియా-రణబీర్‌ల పెళ్లి!

కశ్మీర్‌లో అలియా-రణబీర్‌ల పెళ్లి!

బాలీవుడ్‌ లవర్‌బాయ్ రణబీర్ కపూర్, క్యూట్ హీరోయిన్ అలియాభట్‌ల ప్రేమ లేదులేదంటూనే పీక్స్‌లో కనిపిస్తుంది. ఈ బీ-టౌన్ కపుల్ పబ్లిక్ గా తమ రిలేషన్ షిప్‌ రూట్ మార్చి అధికారికంగా ఒకటి కానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 2020లో వీరిద్దరూ కశ్మీర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అలియాభట్-రణబీర్ కపూర్‌ల పెళ్లి కార్డు ఇదిగోనంటూ ఓ ఫేక్ వెడ్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న వీరిద్దరూ వచ్చే ఏడాది నెల రోజులు సెలవు తీసుకోనున్నారట. డిస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగానే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. రాజీ సినిమా షూటింగ్‌లోనే తాను ప్రేమలో పడినట్లు అక్కడే పెళ్లి కూడా జరగాలనుకుంటున్నట్లు అలియా ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడా వీరి పెళ్లిబాజాలు మోగుతాయనేది నిజమేననిపిస్తోంది. 

గతంలో అలియా ‘మేం రిలేషన్‌షిప్‌లో లేం. ఇది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే. మేం ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్నాం. అతను కంటిన్యూ షూటింగ్ లతో ఖాళీ లేకుండా ఉంటున్నాడు. మేం కలిసి ఉండటం కుదరడం లేదు. అతను చాలా మంచి వాడు. గతంలో కొంచెం ఇబ్బంది పెట్టాడు. నేను కూడా ఏం తక్కువ కాదు’ అని చెప్పింది. 

రణబీర్ కపూర్‌కు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌లు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. అలియాభట్ కూడా సిద్ధార్థ మల్హోత్రా ప్రేమ వ్యవహారాన్ని బ్రేక్ చేసుకుంది.