Rashmika Mandanna: డాక్టర్ను కలిసిన రష్మిక.. ఏమైందో తెలుసా?
నేషనల్ క్రష్గా తనకంటూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన, ప్రస్తుతం తెలుగు, తమిళ హిందీ బాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఎప్పుడూ చలాకీగా, చురుగ్గా కనిపించే రష్మిక.. తాజాగా ఓ డాక్టర్ను కలిసింది. దీంతో రష్మికకు ఏమైందని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్గా తనకంటూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన, ప్రస్తుతం తెలుగు, తమిళ హిందీ బాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అరున్ ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం పుష్ప-2 సినిమా కోసం రెడీ అవుతోంది. ఎప్పుడూ చలాకీగా, చురుగ్గా కనిపించే రష్మిక.. తాజాగా ఓ డాక్టర్ను కలిసింది. దీంతో రష్మికకు ఏమైందని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. రష్మిక అనారోగ్యానికి గురైందా అంటూ వారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్లో పేరుగాంచిన ఆర్థోపెడిక్ వైద్యులు డా. గురవా రెడ్డిని తాజాగా రష్మిక మందన కలిసింది. ఆయనతో కలిసి ఓ ఫోటో దిగగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే రష్మిక తనను ఎందుకు కలిసిందో చెప్పుకొచ్చారు డా.గురవా రెడ్డి. రష్మిక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లుగా తనవద్దకు వచ్చిందని.. అయితే చింతించాల్సిన పని ఏం లేదని ఆయన ఈ సందర్భంగా ఆమెకు తెలిపినట్లుగా చెప్పుకొచ్చారు. ఆమె నటించిన పుష్ప చిత్రం తాను చూశానని.. అందులో ఆమె నటన తనకు బాగా నచ్చిందని రష్మికను ఈ సందర్భంగా అభినందించారు గురవా రెడ్డి.
Rashmika Mandanna: ఆ చిన్నారి డ్యాన్స్కు ఫిదా అయిన రష్మిక.. ప్లీజ్ ఒక్కసారి అంటూ వేడుకుంటోంది!
అయితే ఈ క్రమంలో బన్నీ కూడా తనవద్దకు వస్తాడంటూ కామెడీ చేశారు ఈ డాక్టర్. బన్నీ భుజం నొప్పితో తన వద్దకు వస్తాడని.. ఆయన త్వరగా వస్తే బాగుంటుందని సరదాగా చెప్పుకొచ్చాడు డా.గురవా రెడ్డి. ఏదేమైనా రష్మిక ఇలా ఓ డాక్డర్ను కలవడంతో ఆమెకు ఏమైందా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆరా తీయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది.