Rashmika Mandanna : పుష్ప-2 మూవీలో మార్పులు చేశారు.. రష్మిక మందన్న!

సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్‌ని చేసిన సినిమా 'పుష్ప'. కాగా ఇటీవల ఈ భామ ఒక తెలుగు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పుష్ప-2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప-2 మూవీలో మార్పులు జరిగిని అంటూ తెలియజేసింది.

Rashmika Mandanna : పుష్ప-2 మూవీలో మార్పులు చేశారు.. రష్మిక మందన్న!

pushpa 2 rashmika

Rashmika Mandanna : సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్‌ని చేసిన సినిమా ‘పుష్ప’. ఈ మూవీతో ఇండియా వైడ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ నార్త్ లో కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ అందిపుచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సిద్దార్ద్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’ , రణ్‌బీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాల్లో నటిస్తుంది. మిషన్ మజ్ను సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాబోతుంది.

Rashmika Mandanna : బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ కాంట్రవర్సీపై స్పందించిన రష్మిక..

కాగా ఇటీవల ఈ భామ ఒక తెలుగు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పుష్ప-2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప-2 మూవీలో మార్పులు జరిగిని అంటూ తెలియజేసింది. అయితే ఆ మార్పులు కథ పరంగా కాదు, పాత్రలు పరంగా జరిగింది అంటూ వెల్లడించింది. పుష్ప రాజ్, శ్రీవల్లి క్యారెక్టర్స్ విషయంలో కొన్ని చేంజెస్ జరిగాయి. కంప్లీట్ క్యారెక్టరైజేషన్ మార్చకుండా కొన్ని కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఫస్ట్ పార్ట్ లో ఈ రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. మరి ఇప్పడు ఈ కొత్త చేంజెస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయా? లేదా? అనేది చూడాలి.

కాగా ఇటీవల ‘వరిసు’ ప్రమోషన్ లో పుష్ప-2 షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చింది రష్మిక. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు వెల్లడించింది. పుష్ప-1 పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్టు అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సెకండ్ పార్ట్ లో మెయిన్ విలన్ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కనిపించబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో విలన్ గా కనిపించిన సునీల్.. రెండో భాగంలో కూడా ఉండనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన పాటలు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.