Rashmika : నన్ను ట్రోల్ చేస్తే ఓకే.. నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తే మాత్రం ఊరుకోను..

రష్మిక మాట్లాడుతూ.. చాలా వరకు నేను మౌనంగానే ఉంటాను. మొదట్లో నాపై చాలా ఎక్కువే ట్రోలింగ్ వచ్చింది. అయినా పట్టించుకోలేదు ఎందుకంటే..............

Rashmika : నన్ను ట్రోల్ చేస్తే ఓకే.. నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తే మాత్రం ఊరుకోను..

Rashmika serious comments on Trolls

Rashmika :  నేషనల్ క్రష్ గా పిలిపించుకుంటున్న రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో దూసుకుపోతుంది రష్మిక. ఇటీవలే సంక్రాంతికి వారసుడు సినిమాతో వచ్చి మెప్పించింది. బాలీవుడ్ లో జనవరి 20న మిషన్ మజ్ను సినిమాతో రాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాల ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది రష్మిక. తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రష్మిక ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలపై మాట్లాడింది.

హీరోలు, హీరోయిన్స్, సినిమా వాళ్ళని ట్రోల్ చేస్తారన్న సంగతి తెలిసిందే. రష్మిక పై కూడా చాలా ట్రోల్స్ వస్తుంటాయి. కొన్ని రష్మిక చేసిన వ్యాఖ్యలకు, రష్మిక సినిమాలకి సంబంధించి ఆమెపై ట్రోల్స్ వస్తుంటాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ సీరియస్ అయింది.

Rashmika Mandanna : గొడవ ముగిసిందా.. రిషబ్, రక్షిత్ పై పాజిటివ్ వ్యాఖ్యలు చేసిన రష్మిక..

రష్మిక మాట్లాడుతూ.. చాలా వరకు నేను మౌనంగానే ఉంటాను. మొదట్లో నాపై చాలా ఎక్కువే ట్రోలింగ్ వచ్చింది. అయినా పట్టించుకోలేదు ఎందుకంటే ప్రేక్షకులపై నాకు గౌరవం ఉంది. నా మీద విమర్శలు చేసేవాళ్ళు, ఫేక్ వార్తలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అవేమి నన్ను ఇబ్బందిపెట్టవు, నేను వాటి గురించి ఆలోచించను. కానీ ఇప్పుడు ఆ ట్రోల్స్ శృతిమించి నా కుటుంబాన్ని, నా చెల్లిని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నేను వాటిని తీసుకోలేకపోతున్నాను. నా చెల్లి మానసిక ఆరోగ్యం వీటివల్ల దెబ్బతినకూడదు. అందుకే నా మీద ట్రోల్స్ వచ్చినా పట్టించుకోను కానీ నా ఫ్యామిలీ, చెల్లి మీద మాత్రం ట్రోల్స్ వస్తే ఊరుకోను, కచ్చితంగా రియాక్ట్ అవుతాను అని సీరియస్ అయింది. దీంతో రష్మిక సీరియస్ గా మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.