Raviteja: గ్యాంగ్‌స్టర్ కథతో మాస్‌రాజా పాన్‌ ఇండియా ప్రయత్నాలు!

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ విన్నా పాన్ ఇండియా అనే పదమే వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ నుండి మంచు విష్ణు వరకు.. బెల్లంకొండ శ్రీనివాస్ నుండి సంపూర్ణేష్ బాబు వరకు ఇప్పుడు అందరూ పాన్ ఇండియా వైపే చూస్తున్నారు. ఇప్పటికే కొందరు తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండగా మాస్ రాజా రవితేజ కూడా ఇప్పుడు అదే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తుంది.

Raviteja: గ్యాంగ్‌స్టర్ కథతో మాస్‌రాజా పాన్‌ ఇండియా ప్రయత్నాలు!

Raviteja

Raviteja: సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ విన్నా పాన్ ఇండియా అనే పదమే వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ నుండి మంచు విష్ణు వరకు.. బెల్లంకొండ శ్రీనివాస్ నుండి సంపూర్ణేష్ బాబు వరకు ఇప్పుడు అందరూ పాన్ ఇండియా వైపే చూస్తున్నారు. టాలీవుడ్ నుండి బాహుబలి, శాండల్ వుడ్ నుండి కేజీఎఫ్, కోలీవుడ్ నుండి రోబో ఇలా కొన్ని సినిమాలు సౌత్ సినిమా సత్తా చాటుతూ దేశవ్యాప్తంగా పేరు మ్రోగిపోవడంతో మన మార్కెట్ బాగా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకొనేందుకు మన మేకర్స్ కూడా అదే బాటలో వెళ్తున్నారు.

ఇప్పటికే కొందరు తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండగా మాస్ రాజా రవితేజ కూడా ఇప్పుడు అదే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. అప్పటి వరకు డిజాస్టర్ సినిమాలతో ఇబ్బందిపడిన రవితేజ క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ మీదకి ఎక్కి ప్రస్తుతం ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో రాబోతున్నాడు. మరో వైపు దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

కాగా, ఇప్పుడు రవితేజ ఒక పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా.. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా అనుకోగా ఫైనల్ గా ఇప్పుడు రవితేజ చేతికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.