ముచ్చటగా మూడవసారి!

రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని ఆశిస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్..

  • Published By: sekhar ,Published On : May 4, 2019 / 09:12 AM IST
ముచ్చటగా మూడవసారి!

రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని ఆశిస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్..

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ మధ్య విబేధాలు రావడంతో ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీని సంగతి పక్కన పెడితే, రవితేజ తన తర్వాతి సినిమాని గోపిచంద్ మలినేనితో చెయ్యబోతున్నాడని తెలుస్తుంది. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్‌లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి.

గోపిచంద్ డాన్ శీనుతోనే డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఈ రెండు సినిమాలూ బాగానే ఆడాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని ఆశిస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్.