పవన్ కళ్యాణ్ రక్తం కాదు.. వాళ్లది నా రక్తం: రేణూ దేశాయ్
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి ప్రస్తుతం తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తోంది ఒకప్పటి హీరోయిన్ రేణుదేశాయ్. త్వరలోనే తన మనసుకి దగ్గరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటూ ఇప్పటికే ప్రకటించిన రేణూ తన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తుంది. ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరూ నా సొంతం’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
పవన్ కళ్యాణ్ కొడుకు ఫోటో పెడితే ఇక అభిమానులు ఆగుతారా? సోషల్ మీడియాలో పవన్ పై తమకు ఉన్న అభిమానంను చూపించే ప్రయత్నం చేస్తారు కదా? అటువంటి కామెంట్లే గట్టిగా చేశారు. అభిమానుల్లో ఒక వ్యక్తి.. ఎంతైనా వీరు పవన్ రక్తం కదా అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్పై రేణు దేశాయ్ సీరియస్ అయ్యింది.
నీకు కనీసం సైన్స్ తెలుసా అంటూ ప్రశ్నించింది. సైన్స్ తెలిసిన వ్యక్తివి అయితే వారిలో ఉండేది ఎవరి రక్తమో తెలిసేది అని చెప్పుకొచ్చింది. టెక్నికల్గా సైన్స్ పరంగా చూస్తే వారిలో ప్రవహించేది నా రక్తం. వారు నా రక్తంతో పుట్టి పెరుగుతున్నారు అన్నట్లుగా ఎమోషనల్గా రిప్లై ఇచ్చింది. ఆమె రిప్లైకు మరో అభిమాని స్పందిస్తూ అభిమానులు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. వాటిని మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా అతడు సమాధానం చెబుతూ అమ్మతనం గురించి వారు మాట్లాడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటాను అని వివరించింది.
గతంలో కూడా పవన్ అభిమానులు అకీరాని ఉద్దేశిస్తూ జూనియర్ పవర్ స్టార్ అని పిలిచేవారు. ఈ విషయం అకీరాకి నచ్చదని.. అకీరాని పవన్ తో పోల్చకండి అంటూ అప్పట్లో రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అకీరాని ఇప్పటికీ అలానే పిలుచుకుంటారు. అతడు సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా..? అని ఎదురుచూస్తున్నారు.