RGV: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్జీవీ, కొండా దంపతులు

కొండ చిత్ర యూనిట్ ఇంద్రకీలాద్రిపై దుర్మమ్మను దర్శించుకున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండ చిత్ర యూనిట్ దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు.

RGV: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్జీవీ, కొండా దంపతులు

Vijayawad Temple

RGV: కొండ చిత్ర యూనిట్ ఇంద్రకీలాద్రిపై దుర్మమ్మను దర్శించుకున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండ చిత్ర యూనిట్ దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు.

“విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నా. కొండా దంపతుల భక్తి పారవశ్యం నన్ను ఆకర్షించింది. కొండా సినిమా ప్రమోషన్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నా. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నా. కొండా మురళి సబ్జెక్ట్ ఐదారు సినిమాలు తీసినా చాలదు” అని ఆర్జీవీ తెలిపారు.

“ఆర్జీవీ మాకు దేవుడు పంపిన దూతగా వచ్చి మా బయోపిక్ తీశారు. కేవలం 10 శాతం జీవితాన్నే సినిమాగా తీశారు. మా బయోపిక్ పూర్తిగా తీయాలంటే వెబ్ సెరీస్ సరిపోదు. ఏ శత్రువుకి రాని అనుభవాలు భరించాం. నా ‌పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడింది. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారు. సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ అమ్మవారి దర్శనానికి వస్తాం” అని కొండా సురేఖ పేర్కొన్నారు.

Read Also : వాళ్ళు ఇకపై సినిమాలు దానికోసమే తీసుకోవాలి