RGV : జనసేనలోనూ నా అభిమానులున్నారు.. పవన్ అభిమానిగానే మాట్లాడుతున్నా..

తాజాగా నేడు కూడా కాకినాడలోని సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆర్జీవీ 10 టీవీతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, జనసేనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ మాట్లాడుతూ..................

RGV : జనసేనలోనూ నా అభిమానులున్నారు.. పవన్ అభిమానిగానే మాట్లాడుతున్నా..

RGV comments on Janasena and Pawan Kalyan

RGV :  దర్శకుడు ఆర్జీవీ నిత్యం ట్వీట్స్ తోనో, ఆయన చేసే వ్యాఖ్యలతోనో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవల జనసేన, పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తున్నారు. ఇటీవల పవన్ పెట్టిన బహిరంగసభలో ఆయన మాట్లాడిన స్పీచ్ కి కౌంటర్ గానే కొన్ని ట్వీట్స్ చేశాడు. ఇక నాగబాబు ఆర్జీవిపై సీరియస్ అవ్వడంతో నేను పవన్ అభిమానినే, ఆయన మంచికోసం చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండాలని నాగబాబుకు కౌంటర్ ఇచ్చాడు ఆర్జీవీ.

ప్రస్తుతం ఆర్జీవీ కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. సంక్రాంతి నాడు కోడిపందాల్లో కూడా పాల్గొన్నారు. అలాగే కోడిపందాల్లో గెలిచిన విజేతలకు బహుమతులు కూడా అందించారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఆర్జీవీ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లోనే బస చేసినట్టు సమాచారం.

Anasuya : ఫ్యామిలీతో కలిసి అనసూయ సంక్రాంతి సెలబ్రేషన్స్..

తాజాగా నేడు కూడా కాకినాడలోని సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆర్జీవీ 10 టీవీతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, జనసేనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను పవన్ మీద ఏ ట్వీట్ పెట్టినా అభిమానంతోనే పెడుతున్నాను. కొంతమంది బుద్ధిలేని వాళ్ళు నా ట్వీట్స్ అర్ధం చేసుకోవట్లేదు. వాళ్ళు అర్ధం చేసుకోకపోతే నేనేం చేయలేను. పవన్ కళ్యాణ్ మంచి కోసమే నేను ట్వీట్స్ చేస్తున్నాను. జనసైనికుల్లోను నా అభిమానులున్నారు. ఇక్కడ కూడా జనసేన నాయకులని కలిసాను. వాళ్లంతా నాతో బాగానే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలపై త్వరలో సినిమా తీస్తున్నాను. భవిష్యత్తులో కోడి పందాల మీద కూడా సినిమా తీస్తాను అని అన్నారు. దీంతో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై పవన్ అభిమానులు, జనసేన నాయకులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.