దిశ నిందితుడి భార్యని కలిసిన వర్మ

  • Published By: venkaiahnaidu ,Published On : February 2, 2020 / 10:07 AM IST
దిశ నిందితుడి భార్యని కలిసిన వర్మ

సమాజంలో యదార్థ సంఘటనలనే కథగా తీసుకొని సినిమాలను తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు వర్మ తీసిన వివాదస్పద చిత్రాలే ఇందుకు నిదర్శనం. ‘రక్త చరిత్ర’ 2 భాగాలు, ‘26/11’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి వాస్తవిక ఘటనల ఆధారాంగా వర్మ తీసిన సినిమాలు ఆకట్టుకున్నాయి.

అయితే ఇప్పుడు యావత్ దేశాన్ని కుదేపేసిన హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచార ఘటన ఆధారంగా సినిమా చేయబోతున్నానని,ఆ సినిమా పేరు “దిశ”అని శనివారం(ఫిబ్రవరి-1,2020) ఆర్జీవీ ప్రకటించిన విషయం తెలిసిందే. దిశ అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్‌ చేశాడు.

ఈ నేపథ్యంలో ఇవాళ(ఫిబ్రవరి-2,2020)దిశ హత్యాచార ఘటనలో దోషి…ఎన్ కౌంటర్ లో హతమైన చెన్న కేశవులు భార్య రేణుకను రాంగోపాల్ వర్మ కలిశారు. దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు.. అతని భార్య రేణుకకు భవిష్యత్తు లేకుండా చేశాడని వర్మ మండిపడ్డారు. ‘రేణుక 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది, 17 ఏళ్లకే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందన్నారు. బాస్టర్డ్ చెన్న కేశవులు దిశను మాత్రమే కాకుండా.. అతని భార్య రేణుకను కూడా బాధితురాలిగా మార్చాడు. వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుందని అన్నారు. ఇప్పుడు వారిద్దరికీ భవిష్యత్తు లేకుండా పోయిందంటూ  వర్మ ట్వీట్‌ చేశారు.