ప్రేమంటే ఏంటో చూపావు.. ప్రశాంతంగా ఉండు సుశీ.. రియా ఎమోషనల్ పోస్ట్..

  • Published By: sekhar ,Published On : July 14, 2020 / 02:26 PM IST
ప్రేమంటే ఏంటో చూపావు.. ప్రశాంతంగా ఉండు సుశీ.. రియా ఎమోషనల్ పోస్ట్..

బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నెలరోజులు దాటినా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అతని జ్ఞాపకాలనుంచి అంత త్వరగా తేరుకోలేకపోతున్నారు. ధోని బయోపిక్‌లో సుశాంత్ అక్కగా నటించిన భూమిక తరచూ భావోద్వేగానికి గురవుతూ పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ స్నేహితులు కూడా తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, వారి అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

Sushant Singh Rajput

ఇక సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. తాజాగా ఆమె సుశాంత్‌ను తలచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. ‘‘ఇప్పటికీ నా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నా హృదయానికైన గాయం ఇంకా మానలేదు. నాకు ప్రేమ మీద నమ్మకం కలిగించిన వ్యక్తివి, ప్రేమ బలం చూపిన వ్యక్తివి నువ్వే. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు నువ్వు నాకు నేర్పించావు. నువ్వు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండి ఉంటావు. చందమామ, నక్షత్రాలు, గెలాక్సీలు గొప్ప భౌతిక శాస్త్రవేత్తను హృదయపూర్వకంగా ఆహ్వానించి ఉంటాయి. ప్రశాంతంగా ఉండు సుశీ. నిన్ను కోల్పోయి 30 రోజులు పూర్తయ్యాయి. కానీ, జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ రియా, సుశాంత్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.

https://www.instagram.com/p/CCnBR95HAmO/?utm_source=ig_web_copy_link