కాలం ఆగాలి నా కాలి వేగం చూసి.. లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి..

‘డిస్కోరాజా’లో లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి పాడిన సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : January 17, 2020 / 05:32 AM IST
కాలం ఆగాలి నా కాలి వేగం చూసి.. లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి..

‘డిస్కోరాజా’లో లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి పాడిన సాంగ్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ నటుడు బాబీ సింహా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల సెకండ్ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎస్పీబీ పాడిన ‘నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో’ పాట ఏ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిందో తెలిసిందే.

Image

తాజాగా లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి పాడిన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఆయనతో కలిసి మాస్ మహరాజా రవితేజ కూడా గొంతు కలపడం విశేషం. థమన్ ట్యూన్‌కి సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు.

Image

‘కాలం ఆగాలి నా కాలి వేగం చూసి.. లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి.. కొండలే ఊగిపోవాలి నా జోరుకి.. దిక్కులే పారిపోవాలి నా హోరుకి.. రంగేలి రంగాల పొంగే తరంగాలు తాకాలి ఆ నింగికి’.. ‘రమ్ పమ్ బమ్.. రమ్ పమ్ బమ్.. జనం అందరూ జ్వరం తెచ్చుకుని జడుస్తారు మన పేరు వింటే.. ఇలాంటోడు ఈ ప్రపంచాన మరి ఒకే ఒక్కడంతే.. అంటూ బేజారు పుట్టాలి జేజేలు కొట్టాలి ఈ రోజు మన ధాటికి’.. అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది.

Image

హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జనవరి 19 సాయంత్రం  డిస్కోరాజా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందుగానే జనవరి 24న ‘డిస్కోరాజా’ సినిమాను విడుదల చేయనున్నారు. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.