మెగా హీరో మిస్టికల్ థ్రిల్లర్..
కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ కథానాయకుడిగా నటించనున్న కొత్త చిత్రాన్ని ప్రకటించారు. భారీ హిట్ చిత్రాలకు కేరాఫ్ అయిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యమిచ్చే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై స్టార్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు.
ఈ పోస్టర్లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు షట్చక్రంలో ఓ కన్ను చూపిస్తున్నారు. అసలు ఈ కన్ను, షట్చక్రం, సంస్కృత వాక్యం వెనకున్న కథేంటనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.
మిస్టికల్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా సుకుమార్ రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అంవుతుండగా.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు చిత్ర యూనిట్.