Virupaksha Teaser : విరూపాక్ష టీజర్ వచ్చేసింది.. కొత్త కథతో విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారుగా..

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. తాజాగా ఈ మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక టీజర్ చూస్తుంటే..

Virupaksha Teaser : విరూపాక్ష టీజర్ వచ్చేసింది.. కొత్త కథతో విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారుగా..

Virupaksha Teaser

Virupaksha Teaser : సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కథని అందిస్తున్న ఈ చిత్రాన్ని.. అతడి శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా టీజర్ ని మార్చి 1న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రావూరి పండు హార్ట్ ఎటాక్ తో మృతి చెందడంతో.. టీజర్ రిలీజ్ ని పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా నేడు ఈ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Sai Dharam Tej : అభిమాని మరణం.. విరూపాక్ష టీజర్ రిలీజ్ పోస్ట్‌పోన్ చేసి గొప్ప మనసు చాటుకున్న సాయి ధరమ్..

మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఆడియన్స్ లో మూవీ పై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పుడు టీజర్ తో సినిమా పై అంచనాలు పెరిగేలా చేశారు. ఈ చిత్రం మిస్టికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఇక టీజర్ బట్టి చూస్తే.. ఒక గ్రామంలో క్షుద్రశక్తి పూజలు చేసే ఒక అజ్ఞాత వ్యక్తి వలన ఊరిలో అంతుచిక్కని రీతిలో మరణాలు జరుగుతుంటాయి. ఆ మరణాలు ఎవరు చేస్తున్నారో తెలియక ఊరు మొత్తం భయపడుతుంది. ఇక ఆ మరణాలకు కారణం అవుతున్న వ్యక్తిని హీరో ఎలా కనిపెట్టాడు, ఆ దారిలో తనకి ఎలాంటి సమస్యలు ఎదురైని అనేది మూవీ కథ అని తెలుస్తుంది.

ఇక టీజర్ లో కొన్ని డైలాగ్స్.. ‘చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి, సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి, ఆ ప్రమాదం దాటడానికి నా ప్రయాణం’ వంటి డైలాగ్స్ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. ఇక విజువల్స్ విషయానికి వస్తే.. చాలా గ్రాండ్ గా ఉన్నాయి. చూసే ఆడియన్స్ కి కొత్త అనుభూతుని కలిగిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హై లైట్ గా నిలిచింది.

ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, రాజీవ్ కనకాల, జాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్స్ లో బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.