Republic : ఫ్యాన్స్‌కి సాయి ధరమ్ తేజ్ వాయిస్ మెసేజ్

నవంబర్ 26న ‘రిపబ్లిక్’ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది.. ఈ సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులకు వాయిస్ మెసేజ్ పంపారు..

Republic : ఫ్యాన్స్‌కి సాయి ధరమ్ తేజ్ వాయిస్ మెసేజ్

Tej

Republic: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‏.. రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.

Republic : ఓటీటీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది?

‘రిపబ్లిక్’ సినిమాకి మెగా మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ సపోర్ట్ అందించారు. చిరు, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తే.. పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చారు. ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్, విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

Republic: దేవాకట్టా మరో ప్రయోగం.. డైరెక్టర్ కామెంటరీతో ఓటీటీ స్ట్రీమింగ్!

నవంబర్ 26 నుండి జీ5లో ‘రిపబ్లిక్’ ప్రీమియర్ కాబోతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే జీ 5.. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ విధంగా విడుదల చేస్తున్న తొలి ఓటీటీ వేదిక ‘జీ 5’ కాగా.. ఇలా విడుదల అవుతున్న తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం.

Acharya : ‘సిద్ధ’ టీజర్ వచ్చేస్తోంది..

ఈ సందర్భంగా మూవీ టీమ్ బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తేజ్ రెండు నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన సినిమా ఓటీటీలో విడుదల కాబోతుండడంతో ఫ్యాన్స్‌కి వాయిస్ మెసేజ్ పంపాడు. ‘నేను సాయి ధరమ్ తేజ్.. మీరు నామీద చూపించిన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నా ఆరోగ్యంపై మీరు చూపించన శ్రద్ధ ఎప్పటికీ మర్చిపోలేను.. ‘రిపబ్లిక్’ సినిమాను మీతో కలిసి చూడలేకపోయాను.. అయితే ఈ నవంబర్ 26న ‘రిపబ్లిక్’ సినిమా జీ 5లో విడదులవుతోంది. సినిమా చూసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి’ అంటూ వాయిస్ మెసేజ్ పంపాడు తేజ్.

Bholaa Shankar : చిరు సినిమాలో రష్మి స్పెషల్ సాంగ్..