Republic : టీమ్‌తో సినిమా చూసిన సాయి ధరమ్ తేజ్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది..

Republic : టీమ్‌తో సినిమా చూసిన సాయి ధరమ్ తేజ్

Tej

Republic: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‏.. రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.

Akhanda : బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్!

‘రిపబ్లిక్’ సినిమాకి మెగా మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ సపోర్ట్ అందించారు. చిరు, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తే.. పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు. ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్, విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

Republic : ఫ్యాన్స్‌కి సాయి ధరమ్ తేజ్ వాయిస్ మెసేజ్

నవంబర్ 26 నుండి జీ5లో ‘రిపబ్లిక్’ ప్రీమియర్ కాబోతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే జీ 5.. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ విధంగా విడుదల చేస్తున్న తొలి ఓటీటీ వేదిక ‘జీ 5’ కాగా.. ఇలా విడుదల అవుతున్న తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం.

రీసెంట్‌గా ‘రిపబ్లిక్’ సినిమా చూస్తూ తేజ్ ఓ వీడియో షేర్ చేసాడు. దర్శకుడు దేవ కట్టాతో పాటు జీ 5 టీంతో కలిసి మూవీ చూస్తున్న వీడియో షేర్ చేస్తూ.. ‘రిపబ్లిక్’ లో పంజా అభిరామ్ క్యారెక్టర్‌ని ప్రేమించి చేసానని.. మళ్లీ టీం అందరితో కలిసి ఇలా సినిమా చూడ్డం సంతోషంగా ఉంది అంటూ తేజ్ ట్వీట్ చేసాడు.