బిగ్‌బాస్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హాట్ బ్యూటీ

  • Published By: murthy ,Published On : September 10, 2020 / 03:45 PM IST
బిగ్‌బాస్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హాట్ బ్యూటీ

Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ ఫోర్త్ సీజన్ ఆడియన్స్‌కు విసుగు తెప్పిస్తోంది. ఒక్క గంగవ్వ తప్పితే వినోదాన్ని పంచే కంటెస్టెంట్స్ కరువయ్యారు ఈ సీజన్లో. హీటెక్కించే అందగత్తెలైతే ఈ సీజన్లో ఉన్నారు , వాళ్ల పెర్ఫామెన్స్ పూర్ అని మూడు ఎపిసోడ్లకే జనం ఫిక్స్ అయ్యారు.

అసలు హౌస్లో ఉన్న 16 మంది కంటెస్టెంట్స్లో ఏదో రెండు మూడు ముఖాలు తప్పితే మిగిలినవి కొత్త ముఖాలు. పక్క రాష్ట్రాల నుంచి అద్దెకు తెచ్చుకున్నవాళ్లే. అందుకే తెలుగు బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి ఇంకాస్త టైం పట్టేట్టుగానే ఉంది.




ఈ వారం నామినేషన్ ప్రక్రియ షురూ కావడంతో Gangavvaతో పాటు అభిజిత్, అఖిల్, మెహబూబ్, సుజాత, దివి, సూర్యకిరణ్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఒకరు లేదంటే ఇద్దరు శని ఆదివారాల్లో బ్యాగ్ సర్దేయనున్నారు. కంటెస్టెంట్స్లో సరైన పస లేదు.
https://10tv.in/bigg-boss-records-shaking-with-gangavva-fan-following-after-huge-votes-polling/
అందుకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ముగ్గురిని Bigg Boss‌లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. జబర్దస్త్ ఫేమ్ అవినాష్ పేరు బిగ్‌బాస్ లిస్ట్లో ఉంది. అనూహ్యంగా అవినాష్ తొలి 16 మందిలో మిస్ అయ్యాడు.

అలాగే ఈరోజుల్లో ఫేమ్ సాయి కుమార్ పేరు కూడా వినిపించింది. ఈ ఇద్దర్నీ కావాలనే వెనక్కిపెట్టినట్టు తెలుస్తోంది. ఎలాగూ వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరిద్దరు బ్యాగ్ సర్దేయడం ఖాయమైంది. దీంతో jabardasth avinash, eerojullo saikumar ఫుల్ ఫన్ అందించేందుకు వైల్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం.



ఈ ఇద్దరే కాకుండా మరో బ్యూటిఫుల్ హీరోయిన్ని కూడా హౌస్‌లోకి పంపనునట్లు తెలుస్తోంది. హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపనున్నట్టు తెలుస్తోంది. బ్రేకప్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన Swathi Deekshith జంప్ జిలానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. స్వాతి దీక్షత్ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం పక్కా సమాచారం లేదు

ముక్కు అవినాష్, సాయి కుమార్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికేసినట్టే. తొలివారం నామినేషన్ తరువాత వెళ్తారా? లేక గతంలో మాదిరి మూడు నాలుగు వారాల్లో వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. మనకి ఉన్న సమాచారం ప్రకారం.. అవినాష్, సాయి కుమార్లు ప్రస్తుతం క్వారంటైన్లోనే ఉన్నారు. టైం చూసుకుని బిగ్ బాస్ వీళ్లని రంగంలోకి దింపబోతున్నారు.



ఈ bigg boss wild card entry ఎంత వైల్డ్ అన్నది గత సీజన్లో ట్రాన్స్ జెండర్ తమన్నా చెప్పకనే చెప్పింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. హౌస్లో ఉన్నది రెండు వారాలే అయినా రచ్చ రచ్చ చేసిపారేసింది.

అంతకుముందు ఫస్ట్ సీజన్లో దీక్షాపంత్, నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. రెండో సీజన్లో నందినిరాయ్, పూజా రామచంద్రన్, మూడో సీజన్లో యాంకర్ శిల్పా చక్రవర్తి, తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చారు. ఈ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో… ఫస్ట్ సీజన్లో నవదీప్ తప్పితే మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సీజన్-1లో నవదీప్ ఫైనల్ వరకూ వెళ్లాడు.



తరువాత సీజన్లలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ షోపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. వాళ్లకి కూడా ఈ వైల్డ్ కార్డ్ పెద్దగా ఉపయోగపడలేదు. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.