Prabhas : ‘రాధేశ్యామ్’తో సజ్జనార్ ఆర్టీసీ ప్రమోషన్
తాజాగా సజ్జనార్ 'రాధేశ్యామ్'ను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్ కోసం వాడేశారు. ఈ మేరకు ఓ మీమ్ని ట్వీట్ చేశారు. ఈ మీమ్లో ప్రభాస్, పూజాహెగ్డే మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది..............
Radheshyam : ప్రస్తుతం అంతటా ‘రాధేశ్యామ్’ హవా నడుస్తుంది. ఎక్కడ చూసినా ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. రాధేశ్యామ్ సినిమా ట్రైలర్, సాంగ్స్ లోని కొన్ని సీన్స్ మీమ్స్ లా కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇక టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంస్థ అభివృద్ధికి, ప్రజారవాణాను జనాలకు మరింత దగ్గర చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీమ్స్ కూడా చేపిస్తున్నారు ఆర్టీసీ కోసం. తాజాగా సజ్జనార్ ‘రాధేశ్యామ్’ను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్ కోసం వాడేశారు.
Prabhas : రాజమౌళికి నాకంటే చరణ్, తారక్లే ఎక్కువ
ఈ మేరకు ఓ మీమ్ని ట్వీట్ చేశారు. ఈ మీమ్లో ప్రభాస్, పూజాహెగ్డే మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. ‘చాలా రోజుల తర్వాత కలిశాం, ఏదైనా టూర్ వెళదామా?’ అని ప్రభాస్ అనగా ‘వెళదాం కానీ, ఆర్టీసీ బస్సులోనే వెళదాం’ అని పూజా హెగ్డే అంటుంది. ‘ఎందుకు?’ అని ప్రభాస్ ప్రశ్నించగా ‘ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం’ అని పూజా సమాధానం చెప్తున్నట్టు ఈ మీమ్ ఉంటుంది. ‘బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్’ అనే టైటిల్తో ఈ మీమ్ని పోస్ట్ చేయగా ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. గతంలో కూడా సజ్జనార్ చాలా సినిమాలలోని సన్నివేశాలతో ఆర్టీసీ కోసం మీమ్స్ చేపించిన సంగతి తెలిసిందే.
#TSRTC బస్సులోనే వెళ్దాం అంటున్నా #RadheShyam Choose TSRTC & Encourage the #publictransport @TSRTCHQ @TV9Telugu @SakshiHDTV @ntdailyonline @News18Telugu @baraju_SuperHit @telugufilmnagar @Sreeram_singer @puvvada_ajay @Govardhan_MLA @TeluguBulletin @ChaiBisket @boxofficeindia pic.twitter.com/3QuEsYqN9i
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 10, 2022