శర్వానంద్ ‘జాను’ టీజర్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 12:27 PM IST
శర్వానంద్ ‘జాను’ టీజర్ రిలీజ్

శర్వానంద్, సమంత జంటగా.. తమిళ చిత్రం ’96’ తెలుగు రీమేక్‌లో చేస్తున్నారు. కోలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. అయితే తాజాగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అండ్ టైటిల్ ను రిలీజ్ చేసింది.

ఈ సినిమా ‘జాను’ అనే టైటిల్ తో రాబోతుంది. ఇక గురువారం (జనవరి 9, 2020)న సినిమా టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. శర్వానంద్‌ బైకుపై లాంగ్‌ డ్రైవ్‌ చేస్తూ తాను చదువుకున్న స్కూల్‌కు వెళ్లి కే రామచంద్ర అని పిలిచే డైలాగ్‌ తో టీజర్‌ స్టార్ట్ అయ్యింది.

ఇక ఈ మూవీలో శర్వానంద్‌ కెమెరామెన్‌గా కనిపించనున్నాడు. శర్వానంద్, సమంత మొదటిసారి జోడీ కడుతున్న ఈ మూవీ రిలీజ్ పై తెలుగు ఆడియెన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది.