సమంత సరికొత్త ఛాలెంజ్!..

  • Published By: sekhar ,Published On : August 21, 2020 / 02:49 PM IST
సమంత సరికొత్త ఛాలెంజ్!..

స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు ద్వారా అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. సినిమా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో దొరికిన స‌మ‌యాన్ని వంట నేర్చుకోవ‌డంతో పాటు టెర్ర‌స్ గార్డెనింగ్ చేయ‌డానికి కేటాయించారు సమంత. టెర్ర‌స్ గార్డెనింగ్‌లో మ‌రింత అవ‌గాహ‌న పెంచ‌డానికి సామ్ ఓ కొత్త ఛాలెంజ్‌కు తెర తీశారు సామ్.



https://www.instagram.com/p/CEEt-kdhimz/?utm_source=ig_web_copy_link

అదే.. ‘గ్రో విత్ మీ ఛాలెంజ్‌’.. ఈ ఛాలెంజ్‌లో భాగంగా అంద‌రూ త‌నలా టెర్ర‌స్ గార్డెనింగ్ చేయాల‌ని పిలుపునిచ్చారు స‌మంత‌. దీని కోసం స‌మంత త‌న ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. కొద్ది రోజుల్లో సేంద్రీయ ప‌ద్ధ‌తుల్లో కూర‌గాయ‌లు పండిద్దామ‌ని, కుండ‌, ఖాలీ పాల ప్యాకెట్‌, విత్త‌నాలు, హైడ్రో ఫోనిక్ కిట్‌ను త‌యారు చేసుకుని కూర‌గాయ‌ల‌ను పండించాల‌ని స‌మంత వీడియోలో కోరారు. ఈ ఛాలెంజ్‌కు మంచు ల‌క్ష్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల‌ను స‌మంత నామినేట్ చేశారు.



https://www.instagram.com/p/CD0IAgkhVYS/?utm_source=ig_web_copy_link