Samantha : అవి నా చీకటి రోజులు.. మరోసారి విడాకుల విషయంపై మాట్లాడిన సమంత..

సమంత, చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూలలో సమంత అనేక ఆసక్తికర విషయాలని తెలుపుతుంది.

Samantha :  సమంత(Samantha) విడాకుల(Divorce) తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిపోయి అనంతరం యశోద(Yashoda) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ సమయంలో మయోసైటిస్ సోకిందని మరిన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లి ఇటీవలే కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ పక్క షూటింగ్స్ తో బిజీగా ఉంటూనే మరో పక్క శాకుంతలం(Shakunthalam) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మన పురాణాల్లోని దుశ్యంతుడు – శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖర్(Guna Sekhar) దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం.

శాకుంతలం సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 14న శాకుంతలం సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. దీంతో సమంత, చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూలలో సమంత అనేక ఆసక్తికర విషయాలని తెలుపుతుంది.

NMACC : నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ వేడుకలో తారల సందడి.. గ్యాలరీ!

తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత విడాకుల తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో నా మనసుకు నచ్చినట్టు నేను రియాక్ట్ అయ్యాను. ఇండిపెండెంట్ వుమెన్ గా నన్ను అందరూ అంటున్నారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను చాలా కన్నీళ్లు, కష్టాలు, బాధలు చూశాను. నాకు మంచే జరుగుతుందా అని రోజు మా అమ్మని అడిగేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నేను చీకటి రోజులు చూశాను. అప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. కానీ నా ఫ్యామిలీ, కొంతమంది స్నేహితులు నాకు సపోర్ట్ గా నిలిచారు. గతంతో పోలిస్తే చీకటి రోజులు కొంతవరకు తగ్గాయనే అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాక మనలో ఇంకా ధైర్యం పెరుగుతుంది అని తెలిపింది. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు