Samantha : మరో బిజినెస్ లోకి సమంత ఎంట్రీ.. ఈ సారి ఏంటో తెలుసా??

ఇప్పటికే సమంత పలు బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేసింది. కొన్ని సంస్థల్ని స్థాపించింది. ఎడ్యుకేషన్, క్లాతింగ్ రంగాలలో సంస్థల్ని స్థాపించింది. హోటల్ రంగంలో పెట్టుబడులు...................

Samantha : మరో బిజినెస్ లోకి సమంత ఎంట్రీ.. ఈ సారి ఏంటో తెలుసా??

Samantha invest in new food related business

Samantha :  సమంత(Samantha) మయోసైటిస్ నుంచి కోలుకొని ఇటీవలే కంబ్యాక్ ఇచ్చింది. ఓ పక్క తెలుగు, హిందీలో సినిమాలు, సిరీస్ లు చేస్తూనే మరో పక్క రిలీజ్ కాబోతున్న సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. సమంత నటించిన శాకుంతలం(Shakunthalam) సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా సమంత మరో బిజినెస్(Business) లో ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటికే సమంత పలు బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేసింది. కొన్ని సంస్థల్ని స్థాపించింది. ఎడ్యుకేషన్, క్లాతింగ్ రంగాలలో సంస్థల్ని స్థాపించింది. హోటల్ రంగంలో పెట్టుబడులు పెట్టింది సమంత. ఓ పక్క సినిమాలు, యాడ్స్ కాకుండా ఇలా బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి కూడా సంపాదిస్తుంది. తాజాగా మరో బిజినెస్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది సమంత.

Shaakuntalam : శాకుంతలంలో లాస్ట్ 15 నిమిషాలు అల్లు అర్హ యాక్టింగ్.. గుణశేఖర్!

నౌరీష్ యు అనే ఓ ఫుడ్ సంస్థలో సమంత పెట్టుబడులు పెట్టింది. నౌరీష్ యు మిల్లెట్ ఫుడ్ ని, మిల్లెట్స్ తో తయారుచేసిన ఫుడ్ ని ఉత్పత్తి చేస్తుంది. మిల్లెట్ మిల్క్, మిల్లెట్ చిక్కీస్, మిల్లెట్ ఫ్లెక్స్.. ఇలా మిల్లెట్స్ తో తయారు చేసిన పలు రకాల పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థలో సమంత ఇన్వెస్ట్ చేసింది. సంస్థ యాజమాన్యంతో సమంత వారి బ్రాండ్ మిల్లెట్ మిల్క్ డబ్బాలు పట్టుకొని ఫోజులిచ్చిన ఫోటోని ఇన్వెస్ట్మెంట్ గురు ఇండియా సంస్థ తమ సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ న్యూస్ చెప్పగా సమంత దాన్ని షేర్ చేసి ఎస్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో సమంతకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.