Sankalp Reddy : బాలీవుడ్లోకి మరో తెలుగు దర్శకుడు
ఇటీవల బాలీవుడ్ యువ హీరో విద్యుత్ జమ్వాల్ యాక్షన్ హీరో ఫిల్మ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థలో మొదటి సినిమాకి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం...................
Sankalp Reddy : ఇటీవల తెలుగులో మంచి మంచి సినిమాలు చేసి బాలీవుడ్ కి వెళ్తున్నారు తెలుగు దర్శకులు. బాలీవుడ్ లో కూడా సినిమాలు తీసి సత్తా చాటుతున్నారు తెలుగు దర్శకులు. తాజాగా ఈ కోవలోకి మరో దర్శకుడు చేరాడు. ఘాజి, అంతరిక్షం లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు. మొదటి సినిమా ఘాజితోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు సంకల్ప్.
ఇటీవల బాలీవుడ్ యువ హీరో విద్యుత్ జమ్వాల్ యాక్షన్ హీరో ఫిల్మ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థలో మొదటి సినిమాకి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. సంకల్ప్ డైరెక్షన్ చేయబోయే బాలీవుడ్ సినిమా నిన్న చిత్రీకరణ మొదలైంది. ‘ఐబీ 71’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో హీరో విద్యుత్ జమ్వాల్ ఇంటెలిజెన్స్ అధికారిగా నటించనున్నాడు.
Nagarjuna : ‘బంగార్రాజు’కి కూడా సీక్వెల్ ఉండొచ్చు
ఈ సినిమా గురించి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశం కోసం ఎంతో త్యాగం చేసిన మనకు తెలియని ఎందరో గొప్ప హీరోల కథ ఇది. అలాంటి గొప్ప వాళ్ళ కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు నిజమైన హీరో అంటే ఎవరో ఈ చిత్రంతో కొత్త నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను’’ అని అన్నారు.