కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టిన సూపర్ స్టార్
‘సరిలేరు నీకెవ్వరు’ : కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది..
‘సరిలేరు నీకెవ్వరు’ : కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు దసరా కానుక ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు చెప్తూ.. ‘సరిలేరు నీకెవ్వరు’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘సరిలేరు నీకెవ్వరు’.. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ దగ్గర కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. కొండారెడ్డి బురుజు అనగానే మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఒక్కడు సినిమాలో మహేష్, ప్రకాష్ రాజ్ని కొడితే ట్రాన్స్ఫార్మర్కి తగిలే షాట్ గుర్తొస్తుంది.
Read Also : రజినీ మాటిచ్చాడు – నిలబెట్టుకున్నాడు..
దాదాపు 16 ఏళ్ల తర్వాత మహేష్ సినిమాలో మళ్లీ కొండారెడ్డి బురుజు కనిపించనుంది. లేడీ అమితాబ్ విజయశాంతి, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 2020 సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.