మూడు రాజధానులతో షకీలా పబ్లిక్ స్టంట్
‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’ టీజర్లో మూడు రాజధానులపై షకీలా సెటైర్..
‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’ టీజర్లో మూడు రాజధానులపై షకీలా సెటైర్..
షకీలా.. ఒకప్పుడు కుర్రకారు కలల రాణి.. కేరళలో ఆమె సినిమా రిలీజవుతుందంటే స్టార్ హీరోలు తమ సినిమాలు వాయిదా వేసుకునేవారు అంటే ఆమె ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. కొంత కాలం క్రితం ఫేడవుట్ అయిపోయిన షకీలా.. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంది. ఇటీవల ‘శీలవతి’ అనే సినిమాతో 250వ మైలు రాయిని అందుకుంది.
తాజాగా తన కొత్త సినిమా ట్రైలర్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయంపై సైటెర్ వేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. షకీల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’..
విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాతగా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల చేశారు.
టీజర్లో షకీలా న్యూస్ పేపర్ చదువుతూ.. ‘ఆంధ్రాకు మూడు రాజధానులు’ అని చదువుతూ.. ‘ఆంధ్రకు మూడు రాజధానులేంటి’.. అని తన అసిస్టెంట్ను అడగ్గా.. ‘అవును మేడం.. జగనన్న మూడు రాజధానులు చేసేశాడుగా’ అని చెప్పడంతో షాకైన షకీలా.. ‘ఒక్క స్టేట్కే మూడు రాజధానులా? పోను పోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ పంచ్ వేస్తుంది. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సహ నిర్మాత : లండన్ గణేష్, ఆడియోగ్రఫీ : శ్రీ మైత్రా, ఎడిటర్ : కెఆర్ స్వామి, డిఓపి : శ్యామ్ ప్రసాద్, తరున్ కరామ్తోత్.