తిరుమలలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ టీమ్!

  • Published By: sekhar ,Published On : October 25, 2020 / 02:02 PM IST
తిరుమలలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ టీమ్!

Sharwanand-Rasmika: విజయదశమి సందర్భంగా యువ కథానాయకుడు శర్వానంద్‌, కథానాయిక రష్మిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కాంబినేషన్‌లో SLV Cinemas బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తన్న చిత్రం.. ‘ఆడాళ్లు మీకు జోహార్లు’.. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో శర్వానంద్‌, రష్మిక తిరుమల విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు కిషోర్‌ తిరుమల, సుధాకర్‌ చెరుకూరి కూడా పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిత్రయూనిట్‌ ప్రేక్షకాభిమానులకు దసరా శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ నటిస్తున్న ‘శ్రీకారం’ చిత్రం కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్.

ImageImageImage