పల్లెటూరి పొలాల్లో శర్వా ‘శ్రీకారం’

కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ న్యూ షెడ్యూల్ తిరుపతి దగ్గర్లోని ఒక విలేజ్‌లో స్టార్ట్ చేశారు..

  • Published By: sekhar ,Published On : November 13, 2019 / 08:15 AM IST
పల్లెటూరి పొలాల్లో శర్వా ‘శ్రీకారం’

కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ న్యూ షెడ్యూల్ తిరుపతి దగ్గర్లోని ఒక విలేజ్‌లో స్టార్ట్ చేశారు..

యంగ్ హీరో శర్వానంద్ శరవేగంగా సినిమాలు చేస్తున్నాడు.. ‘96’ తమిళ సినిమా తెలుగు రీమేక్‌తో పాటు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్న శర్వా కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా న్యూ షెడ్యూల్ తిరుపతి దగ్గర్లోని ఒక విలేజ్‌లో స్టార్ట్ చేశారు.

మట్టితో సావాసం చేసే రైతుగా శర్వా సినిమాలో కనిపిస్తాడని సమాచారం. రియాలిటీకి తగ్గట్లుగా సినిమాలో లొకేషన్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పొలాల్లో కెమెరా ఉన్న షోటోను షేర్ చేసింది మూవీ టీమ్..

Read Also : వానమ్ కొట్టాటం – ఫస్ట్‌‌లుక్

‘శ్రీకారం’ అంటూ టైటిల్‌తోనే ఆకర్షిస్తున్న శర్వా, లొకేషన్స్‌తో మరో మంచి ఫీల్ కలిగిస్తున్నాడు. ‘శతమానం భవతి’ తర్వాత తను చేస్తున్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఇది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.