‘షేర్షా’ వస్తున్నాడు..
Shershaah: బాలీవుడ్లో గతకొంత కాలంగా బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసే సినిమాలు చక్కటి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఆ కోవలోనే కార్గిల్ వార్లో చురుకుగా పాల్గొని, పరమ వీరచక్ర బిరుదు అందుకున్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది..
విష్ణు వర్థన్ డైరెక్షన్లో, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్పై, కరణ్ జోహార్, హీరూ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్ వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ కలిసి నిర్మిస్తున్న సినిమాని ‘షేర్షా’.. విక్రమ్ని పాకిస్థాన్ ఆర్మీ ‘షేర్షా’ అని పిలిచే వారు.. అందుకే ఆయన బయోపిక్కి ఈ టైటిల్ పెట్టారు..
సిద్ధార్థ్ మల్హోత్రా కెప్టెన్ విక్రమ్ బాత్రా క్యారెక్టర్లో నటిస్తున్నారు. కైరా అద్వాణీ కథానాయిక. శనివారం ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2021 జూలై 2 ‘షేర్షా’ భారీ స్థాయిలో విడుదల కానుంది.