Shriya Saran: సీక్రెట్గా బిడ్డకు జన్మనిచ్చేసిన హీరోయిన్ శ్రియ.. ఏడాది క్రితమే!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న శ్రీయ శరన్ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది.
Shriya Saran: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న శ్రియ శరన్ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. అయితే, ఇప్పుడు కాదు.. ఏడాది క్రితమే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటివరకు సీక్రెట్గా ఉంచింది శ్రీయ. అయితే, ఆమె భర్త రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ లేటెస్ట్గా ఈ విషయాన్ని రివీల్ చేశాడు.
ప్రపంచమంతా తలకిందులైపోయి, ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉన్న సమయంలో 2020లో క్వారంటైన్లో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోవిడ్ కారణంగా ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో.. మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను’ అంటూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
2018లో ఆండ్రీ కోషీవ్ను శ్రియ పెళ్లాడగా.. స్పెయిన్లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది వెకేషన్ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది శ్రీయ. ఈ మధ్యే భారత్కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో ఉంటుంది.