మంచి పనికోసం-రెండొందలకే శ్రియతో డ్యాన్స్.. మిస్ అవకండి ఛాన్స్..
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, కూలీలు, నిరాశ్రయల సహాయార్ధం హీరోయిన్ శ్రియ ముందుకొచ్చారు..
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, కూలీలు, నిరాశ్రయల సహాయార్ధం హీరోయిన్ శ్రియ ముందుకొచ్చారు..
కోవిడ్ బాధితుల కోసం సీనియర్ యాక్ట్రెస్ శ్రియ శరణ్ తన వంతు సాయమందించడానికి ఓ సరికొత్త ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, కూలీలు, నిరాశ్రయల సహాయార్ధం హీరోయిన్ శ్రియ ముందుకొచ్చింది. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్న ఆమె.. వినూత్నంగా విరాళాలు సేకరిస్తోంది.
@thekindnessproject.in లో కేవలం రూ. 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్ను మెయిల్ చేసి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరింది. మే 9 శనివారం సాయంత్రం 8 గంటలవరకు ఈ అవకాశం ఉందని, ఆదివారం విజేతలను ప్రకటిస్తామని పేర్కొంది. లక్కీడ్రాలో విజేతలుగా నిలిచిన వారు (వీడియో కాల్ )లో తనతో కలిసి డ్యాన్స్, యోగా చేసే అవకాశం సొంతం చేసుకోవచ్చని అలాగే మీరిచ్చే విరాళాలన్నీ నిరుపేదలకు చేరుతాయని, ఈ మంచి పనిలో అందరం భాగస్వాములం అవుదాం అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చింది శ్రియ.